CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 1:12 pm Posted by : coalbelt 24 News

Dosa : కీర దోస తో శరీరానికి లాభమా ? నష్టమా ?

Dosa : వేసవి కాలంలో వేడిమిని తట్టుకోడానికి కీర దోసను ఎక్కువగా తింటాం. కీర దోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో వడదెబ్బ తగలడానికి అవకాశం ఉండదు. ఇది చాలా మందికి తెలిసిన విషయం. కానీ ఇందులో చాలా పోషకాలు శరీరానికి అవసరమైనవి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక బరువు ఉన్నవారు చలికాలంలో ప్రతిరోజూ తింటే బరువు తగ్గుతారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే కీర దోసలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. సులభంగా జీర్ణమవుతుంది. డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా దోసలో ఉన్నాయి. ఇవి రక్తపోటు ను అదుపులో ఉంచుతాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. హార్ట్ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా కీర దోస తిన్నచో గుండె లో ఉన్నటువంటి సమస్యలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దోసలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన మలబద్దకం సమస్య ఉన్నవారు ఉపశమనం పొందుతారు. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});